Header Banner

అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!

  Wed May 21, 2025 13:26        Politics

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాత సుఖీభవ పథకం అమలు పైన స్పష్టత ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. దీంతో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. తల్లికి వందనం బడుల ప్రారంభం లోగా అందించాలని నిర్ణయించారు. అదే విధంగా మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నారు. ఇదే సమయంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు పైన ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇచ్చింది.
ప్రభుత్వ నిర్ణయం
వైసీపీ హయాంలో అమలు చేసిన రైతు భరోసా పథకం కు అన్నదాత సుఖీభవ గా కూటమి ప్రభుత్వం పేరు మార్పు చేసింది. ప్రతీ ఏటా రైతులకు రూ 20 వేలు ఆర్దిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఇక, అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ రూ 6 వేలు.. రాష్ట్ర ప్రభుత్వం రూ 14 వేలు కలిపి ఈ పథకం కింద రైతులకు ఆర్దిక సాయంగా అందిస్తా మని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఏడాది పాలన లో ఈ పథకం అమలు కాలేదు. కాగా, ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాల పైన కసరత్తు పూర్తయింది. అన్ని జిల్లాలకు ఈ పథకం అర్హతల పైన సూచనలు చేసారు.
పీఎం కిసాన్ తో కలిపి
ఇక, ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రైతులకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో పాటుగా మూడు విడతులుగా రూ 14 వేల మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించింది. ఇక.. జూన్ లో పీఎం కిసాన్ మలి విడత నిధులు జమ చేసే అవకాశం కనిపిస్తోంది. జూన్ 15 తరువాత కేంద్రం విడుదల చేసే పీఎం కిసాన్ నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ 5 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ప్రతీ ఏటా కేంద్రం సొమ్ము మూడు విడతలుగా జమైతే, రాష్ట్రప్రభుత్వం మే చివరి వారంలో మొదటి విడతగా రూ.5,500, రెండో విడతగా జనవరిలో రూ.రెండు వేలు అందిస్తుంది.

ఇది కూడా చదవండి: ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ఇకపై నో టెన్షన్..! విమానాల తరహాలో బస్సుల్లో కూడా..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

ఎవ్వరూ మాట్లాడొద్దు..! లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AnnadataSukhibhava #FarmerWelfare #APGovt #ChandrababuNaidu #FarmersSupport #AndhraPradesh